ఏ ఒక్క దేవతను పూజించినా అది పరిపూర్ణ పూజ కాదు. అందుకే ప్రత్యేకంగా విఘ్నాలు తొలగటానికి వినాయకుని, చదువులకై సరస్వతిని, ధనానికై లక్ష్మిని ఇలా అనేక దేవతలను ఆరాధిస్తూ ఉంటాము కాని ఒక్క ఓంకారాన్ని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే. ఓంకారాన్ని జపిస్తే సకల మంత్రాలు జపించినట్లే. ఎందుకంటే ఆ ఓంకారంలోనే సర్వదేవతలూ ఉన్నారు.
మామిడి కాయ
పుల్ల పుల్లగా...తియ్య తియ్యగా...
Sunday 15 April 2012
Saturday 14 April 2012
దేవాలయం.
ఒకప్పుడు మహోన్నత న్యాయస్థానమూ దేవాలయమే. అందు న్యాయమంటపాలు కూడా ఉండేవి. దైవ సన్నిధిలో ప్రమాణపూర్వకంగా సత్యాన్ని అంగీకరించేవారు. అందుకు తగినశిక్ష భగవంతుని వలననే అనుభవించేవారు. అలాంటి విశ్వాసము, అనుభవములు ఉండేవి. ఆలయంలో వైద్యవిద్యకూడా ఉండేది. అది ఆదిదైవిక చికిత్సలకేకాక అర్చకులు వైదశాస్త్ర నిష్ణాతులై ఉండేవారు. అసలు ఆలయ తీర్థమే అకాల మృత్యుహరం. ప్రదక్షిణాలు రోగహరాలు. ఆలయాలు గొప్ప సేవాసదనాలుగా ఉండేవి. ఆలయములకు సమర్పింపబడిన భూములు వ్యవసాయ దారులకు ఉపాధిని కల్పిస్తూ ఉండగా వానివలన లభించే ధాన్యం ప్రసాదములకేకాక పేదల అన్నదానానికి వాడేవారు.
Subscribe to:
Posts (Atom)